ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. అపోహలు వీడి ప్రజలంతా రక్తదానం చేయాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన శిబిరాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు రక్తదానం చేశారు. బోధన్లో ఎమ్మెల్యే షకీల్, బిచ్కుందలో కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ రక్తదానం చేసి స్ఫూర్తి నింపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు.
ఏడో బెటాలియన్లో ఏర్పాటుచేసిన శిబిరంలో రక్తదానం చేస్తున్న పోలీస్ సిబ్బంది
బిచ్కుందలో రక్తదానం చేస్తున్న కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్