సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రామ్ చరణ్కు నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. చెవిటి వ్యక్తిగా రామ్ చరణ్ అద్భుత నటనా పటిమ కనబరిచాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమాలపై అభిమానులలో ఫుల్ క్రేజ్ ఏర్పడింది.
రంగస్థలం చిత్రం ఇతర భాషలలో డబ్ కాగా, తాజాగా తమిళంలోను డబ్ చేసారు. ఈ ఏడాది మేలో రంగస్థలం తమిళ వర్షెన్ను కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు చరణ్ బర్త్డే సందర్భంగా ప్రకటించారు. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు ఆచార్య సినిమాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలు తెలుగులోనే కాక ఇతర భాషలలోను విడుదల కానున్నాయి.