Srisailam | తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రత్యక్ష దైవం సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుకు శ్రీశైలం ఆది దంపతుల ఆశీస్సులు ఉండాలని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు ఆకాంక్షించారు. రాష్ట్ర రాజకీయాలతోపాటు దేశ ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర రాజకీయాల్లో రాణించి ఘన విజయం పొందాలన్నారు. ఇందుకు కేసీఆర్కు శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆశీస్సులు కలగాలని పూర్ణానంద ఆరాధ్యులు ఆశీర్వచనాలు వల్లించారు.
ఆదివారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ విజయ మార్గం వైపుకు వేస్తున్న అడుగులతో దేశ రాజకీయాలు ప్రపంచానికే ఆదర్శనీయమయ్యేలా ఉంటాయని పూర్ణానంద ఆరాధ్యులు అన్నారు.
ఇటీవల కేసీఆర్ కుమార్తె కవిత క్షేత్రాన్ని దర్శించి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ రాజకీయ సేవకు శంఖారావం పూరించిన కేసీఆర్ విజయం సాధించాలని శ్రీశైల ఆది దంపతులకు మొక్కులు చెల్లించారని స్థానాచార్యులు అన్నారు.