మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 4 : సీఎం కేసీఆర్ నిరుపేదల పక్షపాతి అని నాగారం మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్ అన్నారు. మున్సిపాలిటీకి చెందిన సత్తయ్యకు రూ. 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశ్, కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్, నాయకులు నిమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు.
పీర్జాదిగూడ : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని పీర్జాదిగూడ 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరీ అంజిరెడ్డి పేర్కొన్నారు. డివిజన్కు చెందిన బి.ప్రమీలకు రూ. 42,500 సీఎం సహాయనిధి చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు కార్పొరేటర్ లబ్ధిదారుడికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో నాయకులు, నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.