హైదరాబాద్: నగర శివార్లలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న ఐరన్ పరిశ్రమలో (Iron factory) పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
మృతుడిని హేమంత్గా గుర్తించారు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పరిశ్రమలో పేలుడు సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.