భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు రాకేష్ టికాయత్పై జరిగిన ఇంక్ దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. బెంగళూరులో బీకేయూ సమావేశానికి హాజరైన టికాయత్పై కొందరు ఇంక్ దాడి చేశారు. దీనిపై బీకేయూ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో ముజఫ్ఫర్నగర్లోని బీకేయూ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర బీకేయూ జనరల్ సెక్రటరీ ధీరజ్ లతియాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తమ నాయకుడు రాకేష్ టికాయత్కు జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని బీకేయూ సభ్యులు డిమాండ్ చేశారు.
దీనికోసం ఆందోళన చేపడతామని, మెమొరాండంలు సమర్పిస్తామని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం తమ డిమాండ్పై స్పందించకపోతే ఏం చేయాలనే విషయంపై సర్వ్ ఖాప్ పంచాయత్ నిర్వహించాలని కూడా బీకేయూ నిర్ణయించింది.