న్యూఢిల్లీ, జనవరి 10: బీజేపీ సోషల్ వేగు ‘టెక్ ఫాగ్’ యాప్పై చర్చ జరగాలని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. ఇందుకోసం సమావేశం ఏర్పాటు చేయాలని హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్కు మళ్లీ లేఖ రాశారు. ఈ యాప్తో ప్రజల గోప్యతకు భంగం కలుగుతుందని, దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని అందులో పేర్కొన్నారు. టెక్ ఫాగ్పై చర్చకు సమావేశం ఏర్పాటు చేయాలని ఒబ్రెయిన్ కోరడం ఇది రెండో సారి. ఇంతకుముందు కూడా ఒబ్రెయిన్ ప్యానల్ హెడ్ ఆనంద్ శర్మకు ఇదే అంశంపై లేఖ రాశారు. ఈ కమిటీలో ఒబ్రెయిన్ కూడా సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ ఐటీ సెల్ టెక్ ఫాగ్ అనే యాప్ను ఉపయోగిస్తూ సామాజిక మాధ్యమాల్లో విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నదని ది వైర్ సంస్థ ఇటీవల సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.