డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ గురువారం పలువురు అభ్యర్ధులతో జాబితాను ప్రకటించింది. సీఎం పుష్కర్ సింగ్ ధమిని కాషాయ పార్టీ ఖతిమా నుంచి బరిలో దింపింది. దివంగత సీడీసీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సోదరుడు కల్నల్ విజయ్ రావత్ పార్టీలో చేరడంతో బీజేపీలో నూతనోత్తేజం నెలకొంది.
ఇక బీజేపీ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో సుభోద్ ఉనియల్, ప్రీతం సింగ్ పన్వర్, గణేష్ జోషీ, మదన్ కౌశిక్, డాక్టర్ ధన్ సింగ్ రావత్, సతోల్ మహరాజ్, అరవింద్ పాండే, విషెన్ సింగ్, సౌరవ్ బహుగుణ, స్వామి యతీశ్వరానంద్, రాజ్కుమార్, భరత్ సింగ్ చౌదరి, మహేంద్ర భట్, నవీన్ దంకా, బషిందర్ భాగా, సురేష్ రాధోడ్, ప్రదీప్ బాత్రా, అదేష్ చౌహాన్, ప్రణవ్ సింగ్ చౌహాన్, దివాన్ సింగ్ భిస్త్లకు చోటు దక్కింది.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అధికారం నిలుపుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డతుండగా, అంతర్గత కలహాల నుంచి బయటపడి పాలనా పగ్గాలు చేపట్టాలని విపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతోంది. ఇక ఫిబ్రవరి 14న ఒకే దశలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.