న్యూఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ సమావేశం ఈ నెల 23న జరిగే అవకాశం ఉంది.షెడ్యూల్ ప్రకారం మార్చి 17నే సమావేశం జరగాల్సి ఉండగా ఢిల్లీలో ఎంపీ రామ్స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకోవడంతో రద్దయ్యింది. గోమతి అపార్ట్మెంట్లోని తన గదిలో ఎంపీ రామ్స్వరూప్ శర్మ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రామ్స్వరూప్ శర్మ లోక్సభకు ఎన్నికయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖలో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగానూ ఆయన కొనసాగుతున్నారు.