నిర్మల్ : బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్ స్ఫూర్తిగా నూతన పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. కుల మతాలకు అతీతంగా ఎంతో మంది నాటి రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాడితే.. విధిలేని పరిస్థితుల్లో నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేశారన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్మల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా శివాజీ చౌక్ వద్ద మంత్రి ర్యాలీని ప్రారంభించి, 4 కి.మీ. పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ సెక్రటేరియట్కు రాజ్యాంగ నిర్మాత, మహా మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రాత్మకం అన్నారు.
తెలంగాణ ప్రజలందరికి ఇది గర్వకారణమని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు అనే గొప్ప పథకాన్ని తీసుకువచ్చి వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారని ఆయన పేర్కొన్నారు.