న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆయా రాష్ట్రాలకు బుధవారం నూతన ఇన్చార్జ్లను నియమించింది.
యూపీ ఎన్నికల ఇన్చార్జ్గా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను నియమించగా సహ ఇన్చార్జ్లుగా కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, శోభా కరంద్లాజే, అన్నపూర్ణ దేవి, ఎంపీలు సరోజ్ పాండే, వివేక్ ఠాకూర్లను నియమించింది.
ఇక ఉత్తరాఖండ్ ఎన్నికల ఇన్ఛార్జ్గా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పంజాబ్ ఇన్ఛార్జ్గా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అసోం ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్, మణిపూర్ ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి భూపీంద్ర యాదవ్లను నియమించింది.