ముంబై: వర్ధమాన నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ముంబైలోని కూపర్ ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు టీకా ఇచ్చారు. అనంతరం ఆమె నేను టీకా తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి అని ట్వీట్ చేశారు. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ముందుగా పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది టీకాలు వేశారు. ఆ తర్వాత పోలీసులకు వ్యాక్సిన్లు ఇచ్చారు. తాజాగా మార్చి 1 నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి, 45 ఏండ్లు పైబడిన దీర్ఘకాలిక రోగులకు టీకాలు ఇస్తున్నారు.