ప్రయాగ్రాజ్: ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ మాజీ ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా శుక్రవారం అర్థరాత్రి కన్నుమూశారు. కరోనా ఇన్ఫెక్షన్ గురైన శ్యామ్ చరణ్ గుప్తాను ప్రయాగ్రాజ్ నుంచి న్యూ ఢిల్లీలోని ఒక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చివరకు పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణాన్ని శ్యామ్ గ్రూప్ జనరల్ మేనేజర్ మనోజ్ అగర్వాల్ ధ్రువీకరించారు. కరోనా పాజిటివ్గా గుర్తించిన అనంరతం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందారని ఆయన చెప్పారు. అయన మృతదేహాన్ని ప్రయాగ్రాజ్ తీసుకువస్తున్నట్లు కుటుంబసభ్యులు, బంధువులు తెలుపగా.. ఏం చేయాలనే దానిపై ఆసుపత్రి యాజమాన్యం నిర్ణయిస్తుందని తెలుస్తున్నది.
మాజీ ప్రయాగ్రాజ్ ఎంపి శ్యామ్ చరణ్ గుప్తా మార్చి 31 న కరోనా బారిన పడ్డారు. కరోనా నివేదిక పాజిటివ్గా వచ్చిన తరువాత స్థానిక స్వరూప్రణి ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో చేర్చారు. ఆరోగ్యంలో మెరుగుదల లేకపోవడంతో ఢిల్లీలోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం ఆరోగ్యం మరింత దిగజారింది. వెంటిలేటర్ పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈయన భార్య కూడా కరోనా పాజిటివ్గా తేలడంతో గృహనిర్బంధంలో ఉండి చికిత్స పొందుతున్నారు.
ప్రయాగ్రాజ్లోని శ్యామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, సీఎండీ అయిన శ్యామ్ చరణ్ గుప్తా 2014 లో అలహాబాద్ నుండి ఎంపీగా ఉన్నారు. అతను 1984 లో బండా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి ఎన్నికలలో పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ భీసన్ దేవ్ దుబే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అతను 1989 లో అలహాబాద్ మేయర్ అయ్యారు. 1991 లోక్సభ ఎన్నికల్లో అలహాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిగా బండా సీటును గెలుచుకున్నారు. తిరిగి 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అలహాబాద్ నుంచి ఎంపికయ్యారు.
గిన్నిస్ రికార్డు గోర్లు.. 30 ఏండ్ల తర్వాత కత్తిరింపు
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
భారత్లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా
వీడియో వైరల్: పనివాడితో గున్న ఏనుగు సరదా పోట్లాట..! గెలుపెవరిదంటే..?
కరోనా సెకండ్ వేవ్ : కొత్తగా మూడు లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు..
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..