అగర్తలా, మే 20: నియోజకవర్గంలో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన ఓ మహిళా బీజేపీ ఎమ్మెల్యే ఓ పేద మహిళతో కాళ్లు కడిగించుకున్న ఘటన త్రిపురలోని బధర్ఘట్ నియోజకవర్గంలో జరిగింది.
బీజేపీ బధర్ఘట్ ఎమ్మెల్యే మిమి మజుందర్ సూర్యపారా ప్రాంతాన్ని సందర్శించారు. ఊరంతా తిరిగి వచ్చాక ఓ పేద మహిళ ఆమె బకెట్తో నీళ్లు పోసి సబ్బుతో కడిగి.. తువ్వాలుతో తుడిచింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది. దీనిపై నెటిజన్లు, పలు పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.