సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 6 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలకు ఉన్న క్రేజే వేరు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యంగా హుస్సేన్సాగర్తో పాటు అనేక చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనంపై గత ఏడాది నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఏకంగా మూడు నెలల ముందుగానే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఒకవైపు ఉత్సవాలు ఘనంగా జరగడంతో పాటు మరోవైపు పర్యావరణహితంగా న్యాయస్థానాల ఆదేశాలు పక్కా అమలుకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శాంతియుత వాతావరణంలో చిచ్చు పెట్టేందుకు కుట్రలకు తెరలేపాడని నగరవాసులు మండిపడుతున్నారు.
లేనిపోని వివాదాలు సృష్టించి చలి కాచుకునేందుకు ఇప్పుడొచ్చి ఉత్సవాల నిర్వహణపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇదిలా ఉంటే ఇలాంటి అగ్ని పరీక్షలు ఎదురైన ప్రతీసారి నగరవాసులు వాస్తవాలు గ్రహిస్తున్నారు. సంయమనంతో వ్యవహరించి గ్రేటర్లో మత సామరస్యానికి ఊపిరిలూది సమైక్యతను చాటుతున్నారు.
హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు రెండు రోజులుగా బీజేపీ నేతలు పన్నాగాలు పన్నుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు కండ్ల ముందున్నా… ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతికి పూజలు చేస్తున్న దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
3 నెలల ముందుగానే గణేశ్ ఉత్సవాలపై సర్కారు కసరత్తు
గణేశ్ ఉత్సవాలపై తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల కిందటి నుంచే దృష్టి సారించింది. గత ఏడాది హుస్సేన్సాగర్, ఇతర చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనంతో కలుషితం అవుతున్నాయనే పిటీషన్లపై అనుమతుల కోసం సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో హుస్సేన్సాగర్లో నిమజ్జనంపై చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ముందుగానే చర్యలు చేపట్టింది. సుమారు రూ.15 కోట్ల నిధులను కూడా కేటాయించింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ మార్గదర్శకాలు