కోల్కతా: దాడిలో కాలికి గాయమైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య ప్రతినిధి షామిక్ భట్టాచార్య, సీనియర్ నాయకుడు తథాగ్తా రాయ్ కోల్కతాలోని ప్రభుత్వ ఎస్ఎస్కెఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమతను కలవడానికి ప్రయత్నించారు. అయితే మమతను చూడటానికి వైద్యులు వారిని అనుమతించలేదు. దీనిపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘మేము మానవతావాదంతో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చాము. అయితే వైద్యులు మాకు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి అరుప్ బిస్వాస్ను కలిశాం. మమతపై జరిగిన దాడిపై ఆందోళన వ్యక్తం చేశాం. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం. మా సందేశాన్ని సీఎం మమతకు తెలియజేయాలని బిస్వాస్కు చెప్పాం’ అని రాయ్ అన్నారు. మరోవైపు ఆసుపత్రి బయట ఉన్న టీఎంసీ కార్యకర్తలు బీజేపీ నేతలు వెనక్కి వెళ్లాలంటూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.