హుజురాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఓడిపోతామనే భయం బీజేపీ నాయకులను అసహనానికి గురిచేస్తోంది. దీంతో టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం టీఆర్ ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ పావని గౌడ్ పై దాడికి యత్నించారు.
పావనిగౌడ్ గత రెండున్నర నెలలుగా టీఆర్ఎస్ పార్టీ తరపున నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో ఆమెపై దాడికి యత్నించారు. పావని గౌడ్ తప్పించుకోగా ఆమె కారును బీజేపీ నాయకులు ధ్వంసం చేశారు.