హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ బీజేపీ నాయకులు సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించిన కేసీఆర్ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. కేసీఆర్కు ఇప్పటికే ఒక పెద్ద రాష్ట్రం ఉంది. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు ఇతరులతో కలిసే అవకాశం ఉందని సుబ్రమణియన్ స్వామి తన ట్వీట్లో పేర్కొన్నారు.
Congrats to KCR: He has decided that his party will go national. He already has one big state —Telengana— and can coalesce with others to become national pic.twitter.com/Xvp5q685Vw
— Subramanian Swamy (@Swamy39) October 5, 2022