పాట్నా: బీహార్ బీజేపీ నేత బబ్లూ సింగ్పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. కాంట్రాక్టర్ కూడా అయిన బబ్లూ సింగ్ గురువారం ఉదయం అర్రాలోని ఫ్రెండ్స్ కాలనీలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు చాలా దగ్గర నుంచి గన్తో ఆయనపై కాల్పులు జరిపినట్లు చెప్పారు.
కాగా, సమాచారం తెలిసిన వెంటనే బీజేపీ నేత బబ్లూ సింగ్ను ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ హిమాన్షు తెలిపారు. దుండగులు చాలా దగ్గర నుంచి ఆయనపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన అన్నారు.