బెంగళూరు, మే 28: ‘కుటుంబం కేంద్రంగా ఉన్న రాజకీయాలతో దేశానికి ప్రమాదం లేదు. మతతత్వ బీజేపీతోనే దేశానికి ముప్పు. ప్రజల్లో భావోద్వేగ అంశాలను రెచ్చగొట్టి అధికారాన్ని చేపట్టడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం’ అని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి విమర్శించారు.
ఇతర పార్టీల్లో కుటుంబ పాలన, అవినీతి గురించి మాట్లాడుతున్న మోదీ సొంతపార్టీలో కుటుంబ రాజకీయాలపై, అవినీతిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ‘రాజకీయాలు, అవినీతి బీజేపీ నేతల ఫ్యామిలీ బిజినెస్లా మారాయి. మోదీకి ఇవేవీ తెలియవని అనుకోను’ అని వ్యాఖ్యానించారు.