హైదరాబాద్: ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విద్వేష ప్రసంగంపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్లింలను బహిష్కరించాలంటూ బీజేపీ ఎంపీలు ప్రమాణం చేయిస్తున్నారని విమర్శించారు. ‘దేశ రాజధానిలో జరిగిన బహిరంగ సభలో ముస్లింలను బహిష్కరిస్తామని బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఎంపీలు ప్రమాణం చేస్తున్నారు. ఇది ముస్లింలలో భయం పుట్టిస్తోంది. అధికారంలో ఉన్న ఒక ఎంపీ దేశ రాజధానిలోనే ఇలా వ్యవహరిస్తే రాజ్యాంగానికి ఏం విలువ ఉంటుంది?’ అని ట్వీట్ చేశారు. ముస్లింలపై బీజేపీ యుద్ధం ప్రారంభించిందనేది నిజం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ అన్నట్లుగా అందులో పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ విద్వేష ప్రసంగంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించడాన్ని అసదుద్దీన్ తప్పుపట్టారు.
भाजपा-RSS का सांसद देश के राजधानी में, खुली सभा में मुसलमानों का बहिष्कार करने की शपथ ले रहा है। RSS के मोहन ने कहा था कि मुसलमानों में झूठा डर फैलाया जा रहा है।सच तो यही है कि BJP ने मुसलमानों के खिलाफ़ जंग का आगाज़ कर दिया है।दिल्ली CM और @amitshah दिनों ने चुप्पी साध ली है 1/2 pic.twitter.com/X2xMFKLCef
— Asaduddin Owaisi (@asadowaisi) October 9, 2022
మరోవైపు బీజేపీ ఎంపీ వర్మపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ డిమాండ్ చేశారు. ‘ముస్లింలను ఆర్థికంగా బహిష్కరించాలని ఢిల్లీ ప్రజలను బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆదేశిస్తున్నారు. వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించి రెచ్చగొట్టినందుకు ఢిల్లీ పోలీసులు ఈ వ్యక్తిపై చర్యలు తీసుకుంటారా? ప్రధాని మోదీ ఈ ప్రసంగాన్ని మన్నిస్తారా? సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటే బీజేపీ ఉద్దేశం ఇదేనా! మాట్లాడండి’ అంటూ ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు.
BJP MP Parvesh Verma orders the people of Delhi to financial boycott Muslims. Will @DelhiPolice act against this man for inciting hatred amongst communities? Does PM Modi condone this speech? Is this what BJP meant by Sabka Saath Sabka Vikas! Speak up @narendramodi pic.twitter.com/L8XtjlxbQB
— Dr. Shama Mohamed (@drshamamohd) October 9, 2022