ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు
కేపీహెచ్బీ కాలనీ, జూలై 3 : ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ప్రజలకు కల్లారా కనబడుతున్నదని.. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూకట్పల్లి డివిజన్ బీజేపీ దళిత మోర్చ మాజీ అధ్యక్షుడు మదికుంట శ్రీనివాస్, డివిజన్ బూత్ ఇన్చార్జిలు చంద్రశేఖర్, నాగరాజు, రాజశేఖర్, రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కుల అశోక్తో పాటు 50 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో పేదలెదుర్కొన్న కష్టాలు.. నేడు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలందరికీ తెలుసన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా అమలు కాని రైతుబంధు, దళితబంధు, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలు రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తున్నాయన్నారు. ఈ పథకాలనే కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందన్నారు. రాష్ర్టానికొచ్చిన మోదీ ఇక్కడి అభివృద్ధిని చూడాలని కోరారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలందరి ఆదరణ పొందుతున్న టీఆర్ఎస్లో అన్ని పార్టీల నేతలు చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, ఎస్సీసెల్ నియోజకవర్గం అధ్యక్షుడు బొట్టు విష్ణు, టీఆర్ఎస్ నేతలున్నారు.