సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 4 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్నారాయణపురం మం డలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి వీరికి చౌటుప్పల్లో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మర్రిబావి తండాకు చెందిన బీజేపీ వార్డు సభ్యుడు సారనాయక్, వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు ఎంపీపీ గుత్తా ఉమాదేవి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల, దేవులమ్మ నాగారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, 50 దళిత కుటుంబాల వారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. మర్రిగూడ మండలం అజిలాపురంలో కాంగ్రెస్కు చెందిన 40 మంది నాయకులు, కార్యకర్తలు శనివారం రాత్రి మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.