న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: పరివార్లో అంతర్యుద్ధం నడుస్తున్నది. బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల, దోషులకు సత్కారంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవడంతో.. బీజేపీ, వీహెచ్వీ తమ తప్పును ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో రెండింట మధ్య విభేదాలు బజారున పడ్డాయి.
బిల్కిస్ దోషులను సత్కరించినవారు వీహెచ్పీకి చెందిన వారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ జాతీయ వార్తాపత్రికలో రాసిన వ్యాసంలో ఆరోపించారు. దీనిపై వీహెచ్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషులను సత్కరించిన వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఇల్మీ వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేదా పార్టీ వైఖరా చెప్పాలని బీజేపీ నాయకత్వాన్ని డిమాండ్ చేసింది.