తెలంగాణ గడ్డ మీద ప్రేమలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు హుజూరాబాద్ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్పై ప్రజలకు అమితమైన విశ్వా సం ఉన్నదని, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాల ప్రతిరూపమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియా తో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిందని తెలిపారు. తమ పార్టీ సమావేశం గురించి ఇతర పార్టీలకు ఏం పని అని ప్రశ్నించారు. టీఆర్ఎస్పైనా, నాయకులపైనా పిచ్చి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్దే అనే నానుడి హుజూరాబాద్లో మరోసారి నిజం అవుతుందని పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం, వాక్పటిమతో మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడని కొనియాడారు.