‘మహానటి’ చిత్రం ద్వారా జాతీయ అవార్డు సొంతం చేసుకొని భారతీయ సినిమా దృష్టిని ఆకట్టుకుంది అగ్ర కథానాయిక కీర్తిసురేష్. ప్రస్తుతం ఆమె మహిళా ప్రధాన చిత్రాలతో పాటు వాణిజ్య కథాంశాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నది. ఆదివారం కీర్తి సురేష్ జన్మదినం. ఈ సందర్భంగా ఈ భామ మహేష్బాబు సరసన నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’లో ఆమె కొత్తలుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో ఈ అమ్మడు చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఆర్థిక మోసాలు, రైతుల కష్టాల్ని చర్చిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.మది, సంగీతం: తమన్, సీఈఓ: చెర్రీ, నిర్మాణ సంస్థలు: మైత్రీమూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ప్లస్, దర్శకత్వం: పరశురామ్.
లక్ష్యం వైపు గురి
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుడ్లక్ సఖీ’. నగేష్ కుకునూర్ దర్శకుడు. ఆది పినిశెట్టి, జగపతిబాబు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. దిల్రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్చంద్ర పదిరి నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ఆదివారం కథానాయిక కీర్తి సురేష్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. గన్ పట్టుకొని లక్ష్యానికి గురిపెడుతున్న ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ‘ఒక సాధారణ మహిళ జాతీయ స్థాయి షూటింగ్లో విజేతగా ఎలా నిలిచింది? ఆమె జీవిత ప్రయాణమేమిటన్నదే ఈ సినిమా ఇతివృత్తం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: చిరంతన్దాస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, దర్శకత్వం: నగేశ్ కుకునూర్.