న్యూయార్క్: వివిధ దేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన వారికి గ్రీన్కార్డుల జారీపై గల లిమిట్ ఎత్తివేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ విషయమై అమెరికా కాంగ్రెస్లో డెమోక్రాట్ సభ్యులు జో లాఫ్గ్రెన్, రిపబ్లిక్ సభ్యులు జాన్ కుర్టిస్ ఈ బిల్లును ప్రవేశ పెట్టింది.
ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (ఈగల్) యాక్ట్-2021 అనే పేరుతో ఈ బిల్లు రూపుదిద్దుకున్నది. ఈ బిల్లు ఆమోదం కోసం అమెరికాలో దీర్ఘకాలంగా గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లు.. సెనెట్లో ఆమోదం పొందితే, అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశాక చట్టంగా మారుతుంది. గ్రీన్ కార్డు కోసం భారతీయులు వేల మంది దశాబ్దాలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి దేశానికి చెందిన నిపుణులకు ప్రతిఏటా 7% మాత్రమే గ్రీన్ కార్డు జారీ చేస్తున్నది అమెరికా. అలాగే ఫ్యామిలీ స్పాన్షర్స్డ్ గ్రీన్ కార్డులు కూడా 7% ఇచ్చే వారు. ఈ బిల్లు ఆమోదం పొందితే హెచ్-1బీ వీసాపై వచ్చే ఉద్యోగులకు గ్రీన్ కార్డుల జారీపై పరిమితి ఎత్తేశారు. ఫ్యామిలీ స్పాన్షర్డ్ గ్రీన్కార్డులు 15 శాతానికి పెంచేశారు.
ప్రతిదేశానికి ఏడు శాతం పరిమితితో కూడిన గ్రీన్కార్డుల జారీపై పలు సంవత్సరాలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ జనాభా, తక్కువ జనాభా గల దేశాల నుంచి వచ్చిన నిపుణులను ఒకే గాటన కట్టారన్న విమర్శ ఉంది.
గ్రీన్ కార్డు కోసం ప్రతిఏటా రెండు లక్షలకు పైగా భారతీయులు దరఖాస్తు చేసుకునే వారు. సుమారు 75 శాతం దరఖాస్తులు బ్యాక్లాగ్స్గా నిలిచిపోతున్నాయి. ప్రస్తుత విధానం ప్రకారం గ్రీన్ కార్డు పొందాలని కోరుకునే వారిలో చాలా మంది ఆ ఆశ తీరకుండానే చనిపోతున్నారు.
ప్రస్తుత పాలసీ ప్రకారం 10 లక్షల మంది భారతీయ నిపుణులు 200 ఏండ్లు దాటినా గ్రీన్ కార్డు వస్తుందన్న ఆశ కనిపించడం లేదు. భారతీయ నిపుణుల తర్వాత గ్రీన్ కార్డుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారిలో చైనీయులు రెండో స్థానంలో ఉన్నారు.
ఇలాగైతే 2025 నాటికే అందరికీ వ్యాక్సిన్ : శివసేన
కేఎస్ఆర్టీసీ ఇక కేరళదే.. కర్ణాటకకు షాక్
కశ్మీర్ నియంత్రణ రేఖ రక్షణ ఏర్పాట్లపై సైనికాధిపతి సమీక్ష..
ఉచిత కోవిడ్ శిబిరాన్ని ధ్వంసం చేసిన దుండగులు
జీన్స్, టీషర్ట్స్ వేసుకోవద్దు.. సీబీఐ అధికారులకు కొత్త డైరెక్టర్ ఆదేశాలు
ఆ వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా సెకండ్ వేవ్: ప్రభుత్వ అధ్యయనం
అత్యంత అందవిహీనమైన భాష కన్నడ అన్న గూగుల్.. క్షమాపణ చెప్పిన సంస్థ
కోవిన్ పోర్టల్లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
Medicinesలోకి Reliance: నిక్లోసామైడ్ వాడకానికి దరఖాస్తు
పూణే విమానాశ్రయం ద్వారా 10 కోట్లకు పైగా వాక్సిన్ డోసులు రవాణా..
ఈటల రాజేందర్ను ఎవరూ కాపాడలేరు : ప్రభుత్వ విప్ గువ్వల
రూ.43000 కోట్లతో ఆరు సబ్మెరైన్ల నిర్మాణానికి ఆమోదం
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం