సంగారెడ్డి : ట్రాఫిక్ ఉల్లంఘనలకుగాను ఓ బైకర్ చలాన్ల రూపంలో రూ.11,325 చెల్లించాడు. ఈ ఘటన సంగారెడ్డిలో మంగళవారం చోటుచేసుకుంది. సంగారెడ్డి పట్టణ పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా సదరు బైక్పై 11 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు తేలింది. దీంతో యజమాని గంగులూరు నాగరాజు నుండి బైక్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టణంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాగరాజు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. గత రెండు సంవత్సరాలుగా 11 చలాన్లు పెండింగ్లో ఉన్నప్పటికీ తప్పించుకు తిరుగుతున్నాడు. సీజ్ చేసిన బైక్ను దక్కించుకునేందుకు నాగరాజు రూ.11,325 చెల్లించాడు. మూడు చలాన్ల కంటే ఎక్కువ ఉన్న వాహనాలను సీజ్ చేస్తామని కావున వాహనదారులు ఎప్పటికప్పుడు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాల్సిందిగా ఇన్స్పెక్టర్ బి.రమేశ్ సూచించారు.