హైదరాబాద్ : అతడు మైలార్దేవ్పల్లి పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో కార్మికుడు.. కానీ చేసేదేమో బైకుల చోరీ. నిందితుడిపై డజన్ వరకు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. శనివారం మైలార్దేవ్పల్లి చౌరస్తాలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా దొంగతనాల చిట్టా బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాల్గిరి గోస్వామి (24) కాటేదాన్ పారిశ్రమికవాడలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
ఖాళీ సమయంలో పలు కాలనీల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించిన అనంతరం పార్కింగ్ చేసిన బైకులను చోరీ చేస్తున్నాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. శనివారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలార్దేవ్పల్లి చైరస్తా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా నిందితుడి నుంచి 11 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చినట్లు వెల్లడించారు. అంతేకాకుండా మైలార్దేవ్పల్లి, బహదూర్పురా పరిధిలోని ఆటోమొబైల్ దుకాణాల్లో చోరీ కేసుల్లో కూడా నిందితుడని తేలింది.