నల్లగొండ: నల్లగొండలో (Nalgonda) ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పట్టణంలోని భాస్కర్ టాకీస్ కూలీ అడ్డావద్ద స్థానిక కూలీలు, బీహార్ వలస కూలీల మధ్య గొడవ జరిగింది. ఉపాధి విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. అదికాస్తా ఘర్షణకు దారితీయడంతో.. స్థానిక కూలీలపై బిహారీలు ఒక్కసారిగా రాళ్లతో దాడికిదిగారు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు చెల్లాచెదురయ్యారు. ఈ దాడిలో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కూలీలను అక్కడినుంచి చెదరగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.