పట్నా: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం రోజురోజుకూ తగ్గుతున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను మరికొంతకాలం పొడిగిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోగా.. తాజాగా బీహార్ రాష్ట్రం సైతం లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా మహమ్మారి కట్టడి కోసం మరో వారం రోజులు లాక్డౌన్ను పొడిగించాలని నిర్ణయించినట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. లాక్డౌన్ నిబంధనలను ప్రజలంతా తూచా తప్పకుండా పాటించాలని, అందరూ మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని నితీశ్ కోరారు.