పాట్నా: కోవిడ్తో మృతిచెందిన బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీహార్ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిర్ణయానికి ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా వేలాది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ మృతుల కుటుంబాలకు ఏదైనా నష్టపరిహారం ఇస్తున్నారా అని ఇటీవల ఓ కేసులో సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరో వైపు బీహార్లో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం ఇవాళ జనతా దర్బార్ రద్దు చేసింది. సమాజ్ సుదార్ అభియాన్ ప్రోగ్రామ్ను కూడా రద్దు చేసినట్లు తెలిపారు.