గోపాల్గంజ్: బీహార్ కల్తీ మద్యం ( Spurious liquor ) మరో పది మంది ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియ్యా పట్టణంలో కల్తీ మద్యం సేవించి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే గోపాల్గంజ్లో కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. ఆ ఘటనను మరువక ముందే ఇప్పుడు బెట్టియ్యాలో మరో పది మంది ప్రాణాలు పోయాయి. దాంతో బీహార్లో మూడు రోజుల వ్యవధిలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 21కి చేరింది.
మూడు రోజుల వ్యవధిలో రెండు జిల్లాల్లో 21 మంది కల్తీ మద్యం కాటుకు బలి కావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నది. రెండు జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రమంత్రి సునీల్ కుమార్ తెలిపారు.