జైపూర్ : రాజస్థాన్లో అక్కడి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకున్నది. కూరగాయలు, పాలు, కిరాణా, ఔషధాలను విక్రయించే వారికి తొలుత కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఫలితంగా వీరి ద్వారా ఇతర వ్యక్తులకు ఇన్ఫెక్షన్ వ్యాపించదని ప్రభుత్వం నమ్ముతున్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లందరికీ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాజస్థాన్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఈ దృష్ట్యా అక్కడి ప్రభుత్వం మే 3 వరకు మొత్తం రాష్ట్రంలో లాక్డౌన్ విధించింది. చిరువ్యాపారులైన కూరగాయలు, పాలు, కిరాణా, మందులు అమ్మే వారికి మినహాయింపు ఇచ్చారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీరికి ముందుగా టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే, 45 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కరోనా వ్యాక్సిన్ను ప్రాధాన్యత ప్రాతిపదికన ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మే 1 నుంచి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి టీకాలు వేయడం ప్రారంభమైనప్పుడు ప్రభుత్వం వారికి టీకాను ప్రాధాన్యత ఆధారంగా ఇస్తుందని వెల్లడించింది.
అదేవిధంగా, కరోనా ప్రభావిత లేదా హాట్స్పాట్ ప్రాంతాల్లో పనిచేసే బ్యాంక్ ఉద్యోగులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, పండ్లు, కూరగాయల డీలర్లు, పాలు, మందులు, వార్తాపత్రికల పంపిణీదారులు, మీడియా సిబ్బందికి టీకాలు వేయాలని ఆరోగ్య శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అలాగే, ఇప్పటివరకు టీకాలు తీసుకోని ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా టీకాను త్వరగా పొందాలని ఆదేశించారు. తద్వారా కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన ప్రాంతాల్లో వారు విధులు నిర్వర్తించడంలో ఇబ్బందిరాదని ప్రభుత్వం పేర్కొన్నది.
పాపం తల్లి ప్రేమ.. చనిపోయిన కొడుకుతో నిత్యం ఫోన్ కాల్
గర్భంతో ఉన్నా.. మండుటెండ, కరోనాను లెక్కచేయకుండా విధుల్లో డీఎస్పీ.. వీడియో వైరల్
వీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. శాస్త్రవేత్తల పరిశోధనలో సంచలన విషయాలు
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..