హైదరాబాద్: ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ప్రముఖ యాంకర్ సావిత్రి (శివజ్యోతి) విసిరిన చాలెంజ్ను బిగ్బాస్-3 కంటెస్టెంట్ అషూ రెడ్డి స్వీకరించింది. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటింది. అనంతరం మాట్లాడుతూ.. తనకు సవాలు విసిరిన శివజ్యోతికి, ఇంతమంచి కార్య క్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, అది మన బాధ్యత అని చెప్పారు.
మనకు మంచి ఆక్సిజన్ లభించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరింది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అషురెడ్డి సూచించారు. ఆమె మరో ముగ్గురు నటులకు చాలెంజ్ విసిరింది.