ఈ ఫొటోలోని సైకిల్ సాధారణమైనది కాదు. దీనిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాడిపడేసిన ల్యాప్టాప్ల నుంచి తీసిన లిథియం-అయాన్ బ్యాటరీలతో ఇది నడుస్తుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే చాలు 60 కిలోమీటర్లు అలవోకగా వెళ్తుంది. పైగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది.
పైగా దీన్ని ఎవరైనా దొంగిలించాలనుకుంటే అంతే సంగతులు. ఎందుకంటే దీనికి ప్రత్యేకమైన సెన్సర్లు, ట్రాకింగ్ వ్యవస్థను అమర్చారు. ఎవరైనా చోరికి ప్రయత్నిస్తే వెంటనే యజమాని స్మార్ట్ ఫోన్కు మెసేజ్ వెళ్తుంది. సైకిల్ నుంచి వార్నింగ్ అలారం శబ్దం వస్తుంది. ఇంతకీ దీన్ని ఎవరు రూపొందించారో చెప్పనే లేదు కదూ..! అస్సాంలోని కరీంగంజ్ జిల్లాకు చెందిన అస్సాం రైఫిల్స్ ఐటీఐ విద్యార్థి సామ్రాట్నాథ్ అభివృద్ధి చేశాడు.