పుణె: భారత్ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాది జోరుమీదున్న జేసన్ రాయ్(14) ఆఖరి బంతికి బౌల్డ్ అయ్యాడు. భువీ తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ బెయిర్స్టో(1)ను పెవిలియన్ పంపి ఇంగ్లాండ్కు షాకిచ్చాడు. మూడో ఓవర్ చివరి బంతికి బెయిర్స్టో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం బెన్స్టోక్స్(17), డేవిడ్ మలన్(3) క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు ఇంగ్లాండ్ 2 వికెట్లకు 4 పరుగులు చేశాడు.