దుబాయ్: ఐసీసీ బుధవారం విడుదల చేసిన మెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు. కోహ్లీతో పాటు మరో బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ ఒక స్థానం దిగజారి వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ సంచలనం డెవోన్ కాన్వే ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి కెరీర్ అత్యుత్తమ ర్యాంకు నాలుగో స్థానం దక్కించుకున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్లో గొప్పగా రాణించిన కాన్వే(92 నాటౌట్) రేటింగ్ పాయింట్లను మెరుగుపరచుకున్నాడు. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య 42లో నిలువగా, వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ టాప్-100లోకి దూసుకొచ్చాడు.
వన్డే ర్యాంకింగ్స్లో భారత స్పీడ్స్టర్ భువనేశ్వర్ కుమార్ ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకు సాధించాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకోవడంలో భువీ కీలకపాత్ర పోషించాడు. నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో 3/42తో చెలరేగి జట్టుకు విజయాన్నందించాడు. వివాహం కోసం ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కూ దూరమైన బుమ్రా ఒక స్థానం దిగజారి నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నాడు. టాప్-10లో అతనికొక్కడికే చోటు దక్కింది.