ముంబై : గుజరాత్లోని బుజ్ వైమానిక స్థావరంపై .. 1971లో పాకిస్థాన్ వైమానిక దళాలు అకస్మాత్తుగా దాడి చేస్తాయి. 14 రోజుల్లో 35 సార్లు పాక్ దాడి చేస్తుంది. ఆ కథ ఆధారంగా తీసిన భుజ్- ద ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాకు సంబంధించిన ట్రైలర్ను ఇవాళ రిలీజ్ చేశారు. స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నాడు. దేశభక్తి, యాక్షన్ సన్నివేశాలతో భుజ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అభిషేక్ దుదయ్యా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇండో-పాక్ యుద్ధం సమయంలో బుజ్ ఎయిర్బేస్కు స్వ్కాడ్రన్ లీడర్గా విజయ్ ఉంటారు. ఆ పాత్రను దేవగన్ పోషించాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు. ఆర్మీ స్కౌట్ రాంచోడ్దాస్ పగి పాత్రను పోషిస్తున్నాడు. సోనాక్షి సిన్హా కూడా దీంట్లో నటిస్తోంది. 3.20 నిమిషాల ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్లతో నిండిపోయింది. డిస్నీ హాట్స్టార్లో ఆగస్టు 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.