ఎన్నో అడ్డంకుల మధ్య వాయిదాల మీద వాయిదాలు పడుతూ విడుదలైంది జెర్సీ (Jersey ). బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor), మృణాళ్ ఠాకూర్ నటించిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Arjun Reddy) జెర్సీ రీమేక్ చేసిన నిర్మాతలు, బాలీవుడ్నుద్దేశించి వరుస ట్వీట్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు.జెర్సీని కోట్టు పెట్టి రీమేక్ చేయడం కంటే ఒరిజినల్ వెర్షన్ డబ్ చేస్తే బాగుండేదన్నాడు. దీనిపై బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు వర్మ.
పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హిందీప్రేక్షకులు దక్షిణాది కథలతోపాటు హీరోలను ఇష్టపడుతున్నారు. అందువల్ల మేకర్స్ రీమేక్ హక్కులను బాలీవుడ్ అమ్మడం అనవసరమన్నాడు వర్మ. డబ్బింగ్ చిత్రాలను రీమేక్ చేయడానికి బదులు వాటిని విడుదల చేయడం తెలివైన పని. ఎక్కడి నుంచైనా ఏ ముఖం లేదా ఎలాంటి సబ్జెక్ట్ అయినా ఆసక్తి ఉన్నంత వరకు ప్రేక్షకులు ఒకే చెప్తారనేది మెయిన్ పాయింట్ అని మరో ట్వీట్ చేశాడు వర్మ.
Moral of the story is it’s smart to release dubbed films instead of remaking them because it’s obvious that the audiences are ok with any face or any subject from anywhere as long as it interests them #DeathOfRemakes
— Ram Gopal Varma (@RGVzoomin) April 26, 2022
అయితే ఎప్పుడూ ఏదో ఒక అభ్యంతరం చెప్పే నెటిజన్లు ఈ సారి మాత్రం వర్మ ట్వీట్స్ కు మద్దతుగా నిలువడం విశేషం. వర్మ ఇటీవలే కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో గ్యాంగ్ స్టర్ మూవీ ఆర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.