హైదరాబాద్,జూన్ 1: పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని చాలా సంవత్సరాలుగా మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు పాలు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. ఆ పాలకు కొద్దిగా పసుపు కలిపి మనం పసుపు పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని రోజు క్రమం తప్పకుండ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్య నుంచి బయట పడొచ్చు. అదెలాగంటే…!
దగ్గు, జలుబుతో భాధపడేవారు పసుపు పాలను తీసుకోవడం వల్ల వెంటనే ఉపశమనం పొందవచ్చు. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శ్వాసకోశ వ్యాధులను దూరం చేస్తుంది. అంతేకాదు రోజు పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కఫము ఎక్కువుగా ఉన్నప్పుడు గోరు వెచ్చని పసుపు పాలు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు.
పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పకుండ తాగడం మంచిది. అంతేకాదు తరచు పసుపు కలిపిన పాలు తాగడం వల్ల కామెర్లు రాకుండా చేస్తాయి. మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తాయి.