హైదరాబాద్, జూన్ 29:బొప్పాయి ఆరోగ్యానికే కాదు సౌందర్యాన్ని పెంపొందించడంలోనూ చాలా బాగా ఉపకరిస్తుంది. చర్మ సంరక్షణకు బొప్పాయి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పొడిబారిన చర్మం అందవిహీనంగా ఉంటుంది. ఇలాంటి సమస్యకు బయట దొరికే క్రీములు వాడడం కంటే బొప్పాయి పండు ఎంతో బాగా పనిచేస్తుంది.
బొప్పాయి గుజ్జులో అరటిపండు గుజ్జు, తేనే కలిపి మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిలోని విటమిన్స్ చర్మాన్ని రక్షిస్తాయి. సహజంగా మీ ముఖం కాంతివంతం అయ్యేలా చేస్తాయి. ఈ ప్యాక్ తరచుగా వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని సాగకుండా కాపాడుతాయ. అందువల్ల మీరు ఒట్టి బొప్పాయి గుజ్జు మీ ముఖానికి పెట్టుకున్న కూడా చర్మానికి చాలా మంచిది. ఇది మిమ్మల్ని యౌవనంగా ఉంచుతుంది. అంతేకాదు ముడతలు రాకుండా కాపాడుతుంది. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ వల్ల చర్మం ముడతలు లేకుండా కాంతివంతంగా మారుతుంది.