కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అలా ఎన్నికలు ముగిశాయో లేదో ఇలా పాక్షిక లాక్డౌన్ను విధించారు. కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలో పాక్షిక షట్డౌన్ ప్రకటించింది. మార్కెట్లు ప్రతిరోజూ ఐదు గంటలు మాత్రమే పనిచేయడానికి అనుమతించారు.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 2 న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. దీనికి ముందుగా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. రేపటి నుంచి బెంగాల్లోని అన్ని షాపింగ్ కాంప్లెక్సులు, మాల్స్, బ్యూటీ పార్లర్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, బార్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, జిమ్లు, స్పాస్, స్విమ్మింగ్ పూల్స్ను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే సమయంలో మార్కెట్లు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే తెరిచేందుకు అనిమతిస్తున్నారు. అన్ని సామాజిక, సాంస్కృతిక, వినోదం, విద్యా సంబంధ సమావేశాలపై నిషేధం విధించారు. అయితే, ఫార్మసీలు, వైద్య పరికరాలను విక్రయించే దుకాణాలు, కిరాణా దుకాణాలను పాక్షిక లాక్డౌన్ నుంచి మినహాయించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.
నిషేధిత టీఎల్పీ ముందు మోకరిల్లిన ఇమ్రాన్ఖాన్
అమెరికాతో పోరు ఎప్పటికీ ముగియదు : అల్ ఖైదా
మహిళల ఆరోగ్య అవసరాలపై దృష్టి పెట్టాలి: వెంకయ్యనాయుడు
ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
కరోనా కాటుకు షూటర్ దాదీ కన్నుమూత
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
సినిమా మరిచిపోలేని మహా మనీషి.. చరిత్రలో ఈరోజు
ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ను ప్రయోగించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..