కోల్కతా : నటి పాయల్ సర్కార్తో పాటు మరో నలుగురు బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వం బెంగాల్లో సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాయల్ సర్కార్ను బెహలా పుర్బా నియోజకవర్గం నుంచి పాయల్ సర్కార్ను బీజేపీ బరిలోకి దించింది. పాయల్తో పాటు బీజేపీ నేతలు జితేంద్ర తివారి, హిరెన్మయ్ ఛటోపాథ్యాయ్, యష్ దాస్గుప్తా, స్రవంతి ఛటర్జీలకు వై సెక్యూరిటీ భద్రతను కల్పించారు. బెంగాల్లో 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో ఇప్పటివరకూ 79 మంది బీజేపీ నేతలకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించారు
వై కేటగిరీ సెక్యూరిటీ కింద ఎనిమిది మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని భద్రత కోసం నియమించనుండగా ఎన్స్ కేటగిరిలో ముగ్గురు సిబ్బందిని కేటాయిస్తారు. బీజేపీలో చేరిన నటుడు మిథున్ చక్రవర్తి, సువేంధు అధికారిలకు సైతం సీఐఎస్ఎఫ్ ఇటీవల వై కేటగిరీ భద్రతను కేటాయించింది. మరోవైపు ఈనెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకూ ఎనిమిది దశల్లో జరిగే బెంగాల్ పోలింగ్ అనంతరం మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.