హైదరాబాద్, మే,25; సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. తరచుగా వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. వేసవిలో వీటిని నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల బాడీ డీ హైడ్రేషన్ గురి అవ్వకుండా ఉంటుంది. అంతేకాదు బరువు కూడా తగ్గుతారు. ఈ నీరు యాంటీ బయోటిక్ గా కూడా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నీరు తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. వీటిని నానబెట్టడం వల్ల అవి జెల్ లాగా అవుతాయి. ఆ జెల్ లాంటి పదార్ధం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియల పనితీరు మెరుగు పడుతుంది. అంతేకాదు మూత్ర సంభందిత సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిలో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. అంతేకాదు మహిళలకు ఎంతగానో అవసరమైన ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ లభిస్తాయి.
శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు సబ్జా గింజలను నూరి కొద్దిగా నూనెతో కలిపి గాయాలు ఉన్న చోట రాయడం వల్ల అవి త్వరగా మానిపోతాయి. సబ్జా గింజలు శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇలా శుద్ధి చేయడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా నానబెట్టిన సబ్జా గింజలు, అల్లం రసం, తేనె కలుపుకుని తాగడం వల్ల శ్వాస బాగా ఆడుతుంది. తలనొప్పి, జ్వరం, గొంతులో మంట వంటి సమస్యలు ఉన్నప్పుడు సబ్జా గింజలను నానబెట్టి తింటే అలంటి చికాకులు అన్ని తొలగిపోతాయి. నీరసంగా ఉన్నప్పుడు సబ్జా గింజల నీళ్లు తాగితే నీరసం తగ్గుతుంది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల గుండె సమస్యలను దరి చేర నివ్వదు. అంతేకాదు హై బిపి కూడా అదుపులోకి వస్తుంది. ఇవి చర్మ సమస్యలను కూడా అరికడతాయి.