టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil) , అనుపమ పరమేశ్వరన్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయ 2 (Karthikeya 2). చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించాడు. ఆగస్టు 13న గ్రాండ్గా విడుదలైన ఈ మూవీకి తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు భాషల్లో మంచి స్పందన వస్తోంది. ప్రత్యేకించి హిందీ బాక్సాపీస్ వద్ద అద్బుతాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ఉన్నాడు నిఖిల్.
కార్తికేయ 2 ఓ నటుడిగా తనపై మరింత ఎక్కువ బాధ్యత పెట్టిందని స్థానిక మీడియాతో అన్నాడు. ప్రేక్షకులకు అతనకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తగా కథలు ఎంపిక చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. నిఖిల్, అనుపమ కాంబోలో తెరకెక్కిన 18 పేజెస్ త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.
కార్తికేయ 2 చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ-అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్యమీనన్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు.