Beating Retreat ceremony | దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న వాఘా బార్డర్ వద్ద సైనికులు బీటింగ్ రీట్రీట్ వేడుకను ఘనంగా నిర్వహించారు. అట్టారీ-వాఘా బార్డర్.. భారత్, పాకిస్థాన్ బార్డర్. దాన్ని స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున ఓపెన్ చేసి భారత్, పాక్ సైనికులు ఒకరిని మరొకరు ఆలింగనం చేసుకుంటారు. ఆ తర్వాత సెరమనీని నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటానికి పంజాబ్ నుంచి చాలామంది ప్రజలు తరలివస్తారు.