రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇంగ్లండ్తో సిరీస్ ఆడుతున్న సమయంలోనే.. మరో యువ జట్టును ఐర్లాండ్ టూర్కు పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడే జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను నియమించింది.
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా హార్దిక్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతన్ని కెప్టెన్గా ప్రకటించిన బీసీసీఐ.. వైస్ కెప్టెన్గా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ను నియమించింది. ఇంతకుముందే భారత్తో సిరీస్ కోసం ఐర్లాండ్ కూడా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో ఇంగ్లండ్తో భారత జట్టు ఆడే ఏకైక టెస్టు మ్యాచ్లో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆడటం లేదని సమాచారం. గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్కు దూరమైన అతను.. ఇంగ్లండ్ టెస్టు సమయానికి కోలుకోవడం కష్టమని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.
భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠీ, దినేష్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, హర్షల్ పటేల్, ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
India Squad
Hardik Pandya (C), Bhuvneshwar Kumar (vc), Ishan Kishan, Ruturaj Gaikwad, Sanju Samson, Suryakumar Yadav, Venkatesh Iyer, Deepak Hooda, Rahul Tripathi, Dinesh Karthik (wk), Yuzvendra Chahal, Axar Patel, R Bishnoi, Harshal Patel, Avesh Khan, Arshdeep Singh, Umran Malik— BCCI (@BCCI) June 15, 2022