భువనగిరి అర్బన్, నవంబర్ 27: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీసీ రాజకీయ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ బిల్లును పార్లమెంట్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నేత రావుల రాజు భువనగిరిలో చేపట్టిన దీక్షకు శనివారం కృష్ణయ్య సంఘీభావం ప్రకటించి.. ప్రసంగించారు. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొంటున్నాయని, ఫలితంగా దేశంలో బీసీలకు రాజకీయంగా కనీస ప్రాతినిథ్యం లభించడంలేదని మండిపడ్డారు.