గాంధారి : రాష్ట్రంలో కోటీ ఐదులక్షల మంది మహిళలకు దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్తో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ బతుకమ్మ చీరలు, తెలంగాణ ఆడబిడ్డలకు ప్రేమతో ఇచ్చే కానుకలని అన్నారు. ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకునేందుకు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేస్తుందని పేర్కొన్నారు.
త్వరలోనే 57 సంవత్సరాలు నిండిన వారికీ పింఛన్ వస్తుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీపీ రాధబలరాం, ఎంపీడీవో సతీశ్, సర్పంచి మమ్మాయి సంజీవ్, ఏపీవో గంగారాజు, విండో చైర్మన్ సాయికుమార్, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, ఏఎంసీ చైర్మన్ సత్యం, వైస్ ఎంపీపీ భజన్లాల్, మాజీ విండో చైర్మన్ ముకుంద్రావు, శివాజీరావుతో పాటు ఆయా గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.